Header Banner

మేఘాల‌య‌లో షాకింగ్ ఘ‌ట‌న‌! హ‌నీమూన్‌కు వెళ్లిన జంట అదృశ్యం!

  Fri May 30, 2025 15:15        Others

మేఘాల‌య‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కొత్త‌గా పెళ్లైన జంట‌ హ‌నీమూన్‌కు వెళ్లి అదృశ్యమైంది. వారం గ‌డిచినా ఇంకా వారి ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన‌ ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, ఇత‌ర శాఖ‌ల అధికారులు, స్థానికులు ఆ జంట కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా వెల్ల‌డించారు. అలాగే ఈ కేసును ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. 



వివ‌రాల్లోకి వెళితే... మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కి చెందిన ట్రాన్స్‌పోర్టు వ్యాపారి రాజా ర‌ఘువంశీ-సోన‌మ్‌ల‌కు కొత్తగా పెళ్లైంది. ఈ జంట హ‌నీమూన్ కోసం మే 20న మేఘాల‌య వెళ్లారు. చివ‌రిసారిగా సోహ్రా (చిర‌పుంజీ)లో ప‌ర్య‌టించిన వాళ్లు.. ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయారు. అయితే, స్థానికంగా ఓ బైక్‌ను అద్దెకు తీసుకుని కొండ‌ప్రాంతం వైపు వెళ్లిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం ఓ ప్రాంతంలో బైక్‌ను వ‌దిలేసి కాలిన‌డ‌క‌న వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. 

 

ఇది కూడా చదవండి: మద్యం కుట్రపై కీలక ఆధారాలతో సిట్! ఆరుగురు నిందితులను కస్టడీ!



ఇక‌, ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న మేఘాల‌య ప్ర‌భుత్వం ముమ్మ‌ర గాలింపు చేప‌ట్టింది. మరోవైపు వారి కుటుంబ స‌భ్యులు కూడా దంప‌తుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 5ల‌క్ష‌ల రివార్డును ప్రకటించారు. 



ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సీఎం సంగ్మా మాట్లాడుతూ... "మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చిన నూత‌న దంప‌తుల‌కు సంబంధించి దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వాళ్లు అదృశ్య‌మైన‌ట్లు మాకు స‌మాచారం అందింది. ఎంపీ సీఎం మోహ‌న్ యాద‌వ్ కూడా నాతో మాట్లాడారు. ఆ రాష్ట్ర హోంశాఖ నుంచి కాల్స్ వ‌చ్చాయి. ఆ జంట ఆచూకీ కోసం పోలీసులు, అధికారులే కాకుండా స్థానికులు కూడా ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. దీనిపై రోజు వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్నా" అని ముఖ్య‌మంత్రి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. 



కాగా, వ‌ర్షాలు ప‌డుతుండటంతో సెర్చ్ ఆప‌రేష‌న్‌కు ఆటంకం క‌లుగుతుంద‌ని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తున్నామ‌ని, చిర‌పుంజిలో భారీ వ‌ర్షాలు ప‌డుతుండ‌డంతో గాలింపున‌కు అంత‌రాయం క‌లుగుతోంద‌ని వెల్ల‌డించారు.  

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 మద్యం కుట్రపై కీలక ఆధారాలతో సిట్! ఆరుగురు నిందితులను కస్టడీ!

 

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం..! 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు!

 

జర్నలిస్టులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌..! అక్రిడేషన్‌ కార్డుల గడువు పొడిగింపు!

 

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!

 

ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!

 

ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..! 

 

ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..

 

ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

 

ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #MeghalayaNews #ShockingIncident #HoneymoonTragedy #CoupleMissing #BreakingNews #IndiaNews